Skip to playerSkip to main content
  • 13 minutes ago
Telangana Institute of Medical Sciences in Hyderabad : పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం టిమ్స్(తెలంగాణ ఇన్సిట్యూట్​ ఆఫ్​ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రులకు శ్రీకారం చుట్టింది. నేడు మొట్టమొదటి టిమ్స్ ఆస్పత్రి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సూపర్ స్పెషాలిటీ సేవలే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సనత్​నగర్ టిమ్స్‌లో ముఖ్యంగా 4 విభాగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కార్డియక్ సైన్సెస్, ట్రామా కేర్, రీనల్ సైన్సెస్, ట్రాన్స్​ప్లాంటేషన్ చికిత్సలకు ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఏర్పాటు చేశారు. మొత్తం 1000 పడకలతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 300 పడకలు ప్రత్యేకంగా ఎమర్జెన్సీ సేవలకు కేటాయించగా, 100 పడకలు ఈహెచ్​ఎస్​ కోసం, 30 పడకలను డయాలసిస్ సేవల కోసం, వీఐపీ, విదేశీ రోగుల కోసం మరికొన్ని పడకలను ప్రత్యేకంగా కేటాయించారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా అంబులెన్సు సేవలు, డయాగ్నోస్టిక్స్, రోగులు ఎక్కువ సేపు క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా అడ్వాన్స్​డ్​ మేనేజ్​మెంట్​ సిస్టమ్స్, నర్స్ కాలింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది మే నుంచే ఓపీ ట్రయల్ రన్‌ను నిర్వహిస్తుండగా, రోజుకు దాదాపు 300 మందికి చికిత్స అందిస్తున్నారు. 

Category

🗞
News
Transcript
00:00What
Comments

Recommended