Flood in Sripada Yellampalli Project : పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టుకు సంబంధించిన 5 గేట్లు తెరిచి 13 వేల 930 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 37వేల 687 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 29,665 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 19.56 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. నీటి ప్రవాహం పెరగడం వల్ల గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు ప్రజలు, రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గాయత్రి పంప్ హౌస్లోని మూడు పంప్ సెట్ల ద్వారా సుమారు 10,500 క్యూసెక్కులను లిఫ్ట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ద్వారా నేరుగా మిడ్ మానేరులోకి గోదావరి జలాలు తరలిస్తున్నారు. గాయత్రి పంప్హౌస్ నుంచి గోదావరి జలాలు ఎత్తిపోతలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Comments