Skip to playerSkip to main content
  • 2 months ago
Agri Show In Hyderabad : రాష్ట్రంలో కీలక వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా తీర్చిదిద్దుకునేందుకు అత్యాధునిక విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణ సేవలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ ఇందిరాపార్కు ఎన్టీఆర్ మైదానంలో రైతుబడి సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరగనున్న వ్యవసాయ ప్రదర్శన - 2026ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 300 పైగా స్టాళ్లు ఏర్పాటు చేయగా పలు స్టాళ్లు కలియ తిరిగి గుత్తా పరిశీలించారు. పలు స్టాళ్ల నిర్వాహకులతో మాట్లాడారు. ఆత్యాధునిక ట్రాక్టర్లు, రొటేవేటర్లు, ట్రాన్స్ ప్లాంటర్లు, ఇతర యంత్రాల పనితీరు గురించి రైతు బడి సంస్థ వ్యవస్థాపకుడు రాజేందర్ రెడ్డి వివరించారు.

Category

🗞
News
Transcript
00:00To be continued...
Comments

Recommended