Coffee Table Book Launch at Nanakramguda hyderabad : హైదరాబాద్ నానక్రాంగూడ వేదికగా హైబిజ్ టీవీ ఆధ్వర్యంలో రూపొందించిన 'కాఫీ టేబుల్' బుక్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఘనంగా ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో ఎన్నో సవాళ్లను అధిగమించి అగ్రస్థానానికి చేరిన 60 మంది ప్రముఖ వ్యాపారవేత్తల స్ఫూర్తిదాయక విజయగాథలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో 60 మంది ప్రముఖ వ్యాపారవేత్తలకు పురస్కారాలు అందజేశారు. ఈ వేడుకలో రామోజీ ఫిల్మ్సిటీ ఎండీ చెరుకూరి విజయేశ్వరి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్లకు పురస్కారాలు ప్రకటించారు. విజయేశ్వరి తరఫున రామోజీ గ్రూప్ ప్రతినిధి ఏవీ రావు వేదికపైకి వచ్చి అవార్డును అందుకోగా, శైలజా కిరణ్ తరఫున పురస్కారానికి సంబంధించి ఈనాడు ప్రతినిధి ఐ.వెంకట్ పేరును నిర్వాహకులు వేదికపై ప్రకటించారు. ఈ 60 మంది పారిశ్రామిక వేత్తల ప్రయాణం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. వ్యాపారాల వృద్ధికి, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇలాంటి వేదికలు ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. తమ 17 ఏళ్ల ప్రయాణంలో తొలిసారిగా వ్యాపారవేత్తల సానుకూల దృక్పథాన్ని, విజయాలను సమాజానికి పరిచయం చేసేందుకు ఈ పుస్తకాన్ని తీసుకొచ్చామని హైబిజ్ టీవీ ఎండీ రాజ్గోపాల్ తెలిపారు.
Comments