Gold Stolen CC Cam Video Viral : బంగారు గొలుసు కొంటామని వచ్చిన మహిళలు, దుకాణంలోని 10 గ్రాముల గొలుసు దొంగతనం చేసిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటుచేసుకుంది. తాండూరు పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద గంజిపల్లి సాయి జువెలరీ దుకాణానికి శుక్రవారం ఉదయం ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తి, చిన్నారితో కలిసి వచ్చారు. తులం బంగారు గొలుసు కావాలని డిజైన్లు చూపించాలని కోరారు. కొన్ని గొలుసులు చూశాక ఇంకా డిజైన్లు చూపించాలన్నారు. మిగతా గొలుసులు చూపించేందుకు దుకాణంలోని ఓ మహిళ పక్కకు వెళ్లిన తర్వాత ప్రదర్శనకు పెట్టిన పది గ్రాముల బంగారు గొలుసును అమాంతం లాక్కొని దాచిపెట్టుకున్నారు. ఆ వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు. ప్రదర్శనలో పెట్టిన బంగారం కనిపించకపోయే సరికి, దుకాణం యజమాని సీసీ టీవీలో పరిశీలించారు. ప్రదర్శనకు పెట్టిన బంగారం గొలుసును ఓ మహిళ చోరీ చేయడం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దీంతో వెంటనే తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments