Polavaram Waters To Visakhapatnam District On The 14th Of This Month : ఈనెల 14వ తేదీన ఉమ్మడి విశాఖ జిల్లాకు పోలవరం జలాలు తరలించే ఏర్పాట్లను సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు వేగవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారని హోంమంత్రి అనిత, అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా పోలవరం నది జలాలు తరలించేందుకు పాయకరావుపేట వద్ద తాండవ నదిపై భారీ అక్విడక్టు పనులను ఇప్పటికే పూర్తి చేశారు. దీంతోపాటు ఎస్. రాయవరం మండలం దార్లపూడి సమీపాన వరాహ నదిపై అసంపూర్తిగా ఉన్న మరో ఆక్విడక్టు పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. పలుచోట్ల కాలువకు అనుసంధానంగా వంతెన నిర్మాణం పనులు కూడా పూర్తి అవుతున్నాయి. పాయకరావుపేటలో ఉన్న చక్కెర కర్మాగారం వద్ద పోలవరం కాలువకు అనుసంధానం భారీ సాగునీటి స్లూయిస్ నిర్మించి దానిని తాండవ నదికి అనుసంధానిస్తున్నారు. ఈ పనులు కూడా పాయకరావుపేటలో దాదాపు పూర్తయ్యాయి.
Comments