CM Revanth Reddy offers Prayers at Ujjaini Mahankali Temple : ఈరోజు తెల్లవారుజాము నుంచే సికింద్రాబాద్లో లష్కర్ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి సీఎం రేవంత్రెడ్డి వచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన సీఎంకు నిర్వాహకులు మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. సీఎంతో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్లు ఉన్నారు. కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించారు.
Comments