Moola Nakshatra Prayers at Vargal Vidya Saraswati Temple : ఆషాఢ మాసం సందర్భంగా సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారు శాకాంబరీ దేవిగా భక్తులకు దర్శనిమిచ్చారు. అమ్మవారిని వివిధ రకాల పండ్లు, కూరగాయలతో శాకాంబరీ దేవిగా సుందరంగా అలంకరించారు. ఆలయం అంతటా పండ్లు, కూరగాయలతో ప్రత్యేక అలంకరణలు చేసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
Comments