Skip to playerSkip to main content
  • 1 year ago
CM Revanth Reddy Responds on Eenadu Story : ఈనాడు-ఈటీవీలో ప్రచురితమైన మరో కథనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కండరాల క్షీణత వ్యాధితో జీవన్మరణ పోరాటం చేస్తున్న ఇంటర్ విద్యార్థి రాకేశ్​పై ఈనాడులో ప్రచురితమైన 'నాకూ బతకాలని ఉందమ్మా' కథనానికి సీఎం చలించారు. రాకేశ్​కు ఉచిత వైద్యంతో పాటు ఛార్జింగ్ వాహనం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో రాకేశ్‌ కుటుంబసభ్యులతో సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అన్నిరకాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి తరఫున హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి రాకేశ్​ తల్లిదండ్రులు గూళ్ల సమ్మయ్య, లక్ష్మీ ధన్యవాదాలు తెలిపారు. రాకేశ్​ ఇంటికి వెళ్లి ఛార్జింగ్ వాహనం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Category

🗞
News
Comments

Recommended