Skip to playerSkip to main content
  • 12 minutes ago
Vijayawada Singapore Flight Late : విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు బయలుదేరి వెళ్లాల్సిన ఇండిగో విమానం ఆలస్యమైంది. అంతకుముందు ల్యాండింగ్ సమయంలో ఆ విమానాన్ని ఒక పక్షి ఢీకొట్టింది. పౌర విమానయాన నిబంధనల ప్రకారం విమానాశ్రయ అధికారులు ఆ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో సింగపూర్ వెళ్లే ఈ విమానం ఆలస్యంగా బయలుదేరింది. వాస్తవానికి ఉదయం 9:00 గంటలకు బయలుదేరాల్సిన ఈ విమానం రెండున్నర గంటల పాటు ఆలస్యంగా ప్రయాణమైంది. సమస్య పరిష్కారమైన తర్వాత అది ఉదయం 11:31 గంటలకు సింగపూర్​కు బయలుదేరింది. విమానంలోని 131 మంది ప్రయాణికులతో పాటు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కూడా ఉన్నారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ కాకముందే ఈ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం పట్ల  ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. విమానాన్ని పక్షి ఢీకొనడం వల్ల ప్రయాణికులు సుమారు రెండున్నర గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Category

🗞
News
Comments

Recommended