Celebrities Visited Lord Venkateswara At Tirumala : తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో రాష్ట్రమంత్రి టీజీ భరత్, తమిళనాడు సీఎం విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, రవితేజ కుమారుడు మహధన్, కుమార్తె మోక్షదలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన రాష్ట్రమంత్రి టీజీ భరత్, తమిళనాడు సీఎం విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, రవితేజ కుమారుడు మహధన్, కుమార్తె మోక్షదలు స్వామివారిని దర్శించుకొని దేవస్థానం హుండీలో కానుకలు సమర్పించి, మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసారు. ఇదిలా ఉండగా, తిరుమల శ్రీవారిని మే నెలలో 25,46,168 మంది భక్తులు దర్శించుకున్నారు. 2025 మేతో పోలిస్తే అదనంగా 2,85,308 మందికి దర్శన భాగ్యాన్ని కల్పించింది. తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలోనే ఇదో అరుదైన రికార్డుగా భావించవచ్చు. ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ తో భక్తుల కదలికలను నిరంతరం స్వయంగా పర్యవేక్షించడంతో పాటు ఇంత మంది భక్తులకు నిర్విఘ్నంగా దర్శన భాగ్యాన్ని కల్పించడం సాధ్యమైంది.
Comments