People Protest For Drinking Water Supply In NTR District: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామంలో మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గ్రామస్థులు ఆందోళన చేశారు. కమ్మవారిపాలెం గ్రామంలో రక్షిత మంచినీటి పథకం వద్ద మహిళలు ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన చేశారు. గ్రామంలో వారం రోజుల నుండి మంచినీళ్లు రావటం లేదన్నారు. జలజీవన్ మిషన్ పధకం పనులు అసంపూర్తిగా వున్నాయని, గ్రామానికి వచ్చే ప్రధాన పైపు లైన్లు పగిలిపోయిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో అక్రమ మెాటారు మంచి నీటి కనెక్షన్లు తొలగించాలన్నారు. కమ్మవారిపాలెంలో తక్షణమే మంచి నీరు ఇవ్వాలని సీపీఎం నాయకులు కర్రి వెంకటేశ్వర రావు డిమాండ్ చేశారు. వారం రోజులుగా మంచి నీరు రాక దాహార్తితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ట్యాంక్ల ద్వారా మంచి నీరు ఇవ్వాలని కోరారు. అధికారులు నిర్లక్ష్యం వీడి కమ్మవారిపాలెంలో మంచినీళ్లు సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మవారిపాలెం గ్రామ సీపీఎం నాయకులు పత్తిపాటి శ్రీనివాసరావు, చెరుకుపల్లి రమేశ్, సుబ్బారావు, శ్రీనివాసరావు, శ్రీరామనేని స్వామి, మంచి దనమ్మ, ఏలూరు సామ్రాజ్యం, చండ్ర దుర్గ, రాగి స్వామి, నాగలక్ష్మి, జగిని, గౌసియా నాయక్, గోపి నాయక్, పలువురు మహిళలు పాల్గొన్నారు.
Comments