Skip to playerSkip to main content
  • 6 hours ago
Telangana RTC launched G I on Wheels : తెలంగాణలో భౌగోళిక గుర్తింపు పొందిన కళలకు మరింత ప్రాచుర్యం కలిగించేలా ప్రభుత్వం ఆర్టీసీ సమన్వయంతో హైదరాబాద్​లోని ఎంజీ బస్టాండ్​లో 'G.I ఆన్‌ వీల్స్' పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. హైదరాబాద్‌ ఎంజీబీఎస్​ బస్టాండ్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్​తో గవర్నర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 6 జీఐ ట్యాగ్​లు ఉన్నాయి. పొచంపల్లి ఇక్కత్, వరంగల్ తివాచీలు, కరీంనగర్​ సిల్వర్ ఫిలిగ్రీ, చేర్యాల పెయింటింగ్, నారాయణపేట చీరలు, నిర్మల్ పెయింటింగ్ ఉన్నాయి. చేనేత, కుటీర పరిశ్రమలకు చేయూతను ఇచ్చేందుకు బస్సులపై ఆయా చిత్రాలతో ప్రచారం కల్పించేలా ఆర్టీసీ చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు. జీఐ ఆర్ట్స్​ను ప్రమోట్ చేయటం వల్ల ఆ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుందని కళాకారులకు జీవనోపాధి మెరుగుపడుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. టూరిజం, కళలను ప్రోత్సహించేందుకు ఆర్టీసీ అన్నివేళలా ముందుంటుందని అన్నారు. ఈరోజు జీఐ ఆర్ట్ వేసిన 6 ఎక్స్​ప్రెస్ బస్సులను ప్రారంభించామని భవిష్యత్​లో ఈ సంఖ్యను పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందన ఇతర అధికారులు పాల్గొన్నారు.   

Category

🗞
News
Transcript
00:00What
Comments

Recommended