Skip to playerSkip to main content
  • 17 minutes ago
Markapuram Vehicle Accident : మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం పరిధిలోని రాజుపాలెం వద్ద ఉన్న జాతీయ రహదారిపై, అతివేగంతో ప్రయాణిస్తున్న ఒక కారు తన ముందు వెళ్తున్న ఒక జేసీబీ వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ వాహనాన్ని ఢీకొన్న వెంటనే ఆ కారులో మంటలు చెలరేగాయి. పరిస్థితిని గమనించి అప్రమత్తమైన కారులోని ఐదుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మంటల తీవ్రతకు ఆ కారు పూర్తిగా కాలి బూడిదైపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా మార్కాపురం జిల్లాలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాహనాల్లో అధిక శాతం యాక్సిడెంట్​ తర్వాత మంటలు చెలరేగుతున్నాయి. అసలే ఎండలు కాబట్టి ప్రయాణికులు చాలా జాగ్రత్తగా వాహనాలు నడపాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

Category

🗞
News
Comments

Recommended