CM Revanth Reddy Visits SLBC Tunnel Live : నాగర్ కర్నూల్ జిల్లా మన్నేవారిపల్లిలో సీఎం రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. హెలీ మాగ్నటిక్ సర్వేకు సిద్ధంగా ఉన్న సర్వే హెలికాప్టర్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. అధునాతన పరికరాలను సైతం సీఎం పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకం పనుల పునరుద్ధరణలో భాగంగా నేటి నుంచి సర్వే చేయనున్నారు. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో మాగ్నటిక్ జియోఫిజికల్ సర్వే నిర్వహించనున్నారు. హెలికాప్టర్కు అమర్చిన స్పెషల్ ట్రాన్స్మీటర్ ద్వారా సర్వే అనేది జరగనుంది. భూమిలో వెయ్యి మీటర్లలోతు వరకు జియో లాజికల్ డేటాను సేకరించనుంది. హైటెక్ సర్వే పద్ధతితో భూమి లోపల షీర్జోన్లు, నీటి ప్రవాహాలను ఈ సర్వేలో గుర్తించనున్నారు. సొరంగం తవ్వాల్సిన మిగిలిన 9.8 కిలోమీటర్ల మార్గంలో ఈ సర్వే చేపట్టనున్నారు. ఫిబ్రవరి 22న.. సొరంగం పనులు జరుగుతున్న సమయంలో పైకప్పు కూలడంతో ఎనిమిది మంది చిక్కుకుపోగా టన్నెల్ బోరింగ్ యంత్రం పూర్తిగా ధ్వంసం అయింది. ఇద్దరి మృతదేహాల్ని మాత్రమే బయటకు తీశారు. అప్పట్నుంచి SLBC సొరంగం పనులు నిలిచిపోయాయి. Conclusion:
Be the first to comment