Argument In Ananthapur: అనంతపురం నగరపాలక సమావేశంలో సభ్యుల మధ్య రసాభాస చోటుచేసుకుంది. నగరపాలక సంస్థకు చెందిన భూములు కబ్జాలకు గురవుతున్నాయనే అంశాన్ని తరచూ పలు సమావేశాల్లో లేవనెత్తినప్పటికీ దానికి పరిష్కారం చూపలేదని పలువురు కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కౌన్సిల్ కోఆప్షన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి సైతం తన ఆందోళన వెళ్లగక్కారు. ప్రజా సమస్యల మీద మాట్లాడనివ్వడం లేదని ప్రశ్నించారు. కౌన్సిల్ సమావేశం ప్రజా సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసింది కాదని, కేవలం వైఎస్సార్సీపీ లాభార్జన కోసం మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. దీంతో ఇది ఇరువురి సభ్యుల మధ్య గొడవకు దారి తీసింది.
Be the first to comment