Skip to playerSkip to main content
  • 2 days ago
Simple Wedding Of IAS IPS Officers In Choutuppal : చాలా మంది యువత పెళ్లంటే భయపడుతుంటారు. సుమారు 30 ఏళ్లు దాటనిదే వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి పెళ్లి చేసుకోవాలంటే రూ. లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే ధనవంతులు వివాహాలు చేసుకునే సందర్భాల్లో రూ. కోట్లలో ఖర్చులు చేస్తూ ఉంటారు. కాగా వీటన్నింటికీ భిన్నంగా యాదాద్రి జిల్లాలో ఐఏఎస్​, ఐపీఎస్ అధికారులు నిరాడంబరంగా వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకి చెందిన యువ ఐపీఎస్​ అధికారిణి శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ఐఏఎస్​ అధికారి శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం ట్రైనింగ్‌లో ఉన్నారు. కుటుంబసభ్యులు, ఉన్నతాధికారుల సమక్షంలో చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఎలాంటి ఆడంబరం లేకుండా వివాహం చేసుకున్న ఈ కొత్త జంటకు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

Category

🗞
News
Transcript
00:00Let's get started.
00:30Let's get started.
01:00Let's get started.
Comments

Recommended