Skip to playerSkip to main content
  • 2 days ago
Congress Cadres Celebrations at Gandhi Bhavan : జూబ్లీహిల్స్​ ఉపఎన్నికలో అధికార పార్టీ కాంగ్రెస్​ విజయఢంకా మోగించింది. ఈ సందర్భంగా గాంధీభవన్​లో నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చి సంతోషంతో మిఠాయిలు తినిపించుకున్నారు. మంత్రులు, ముఖ్య నేతలు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ సినీయర్​ నాయకుడు వి.హనుమంతరావు హుషారుగా నేతలందరితో కలిసి స్టెప్పులేశారు. దీంతో గాంధీభవన్ పరిసరాలు సందడిగా మారాయి. సీఎం రేవంత్​ రెడ్డి పోస్టర్​లు చూపుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంబరాల్లో కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతరావు, మత్స్య సహకార కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్, రోహిన్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్​ ఉపఎన్నికలో నవీన్​ యాదవ్ ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 98,988 ఓట్లు ఆయన సాధించారు. 24,729 ఓట్ల మెజార్టీతో బుల్లెట్​లా దూసుకుపోయారు. విజయానంతరం నవీన్ యాదవ్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి యూసుఫ్​ గూడా నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఇందులో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుతూ సందడి చేశారు.

Category

🗞
News
Transcript
00:00Music
Be the first to comment
Add your comment

Recommended