అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని పెన్నహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆ ఉత్సవాలలో భాగంగా భక్తులు సమర్పణలతో ఆలయానికి భారీగా హుండీ ఆదాయం వచ్చింది.
6 హుండీల లెక్కింపు :
బ్రహ్మోత్సవాల అనంతరం దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో 6 హుండీలను తెరిచి లెక్కింపు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల లో భక్తులు సమర్పించిన ముడుపులు,కానుకలు హుండీల రూపంలో13 రోజులకు గాను రూ. 15,93,000 హుండీ ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.
ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడినప్పటికీ, అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. హుండీల లెక్కింపు పూర్తిగా పారదర్శకంగా, అధికారుల పర్యవేక్షణలో నిర్వహించబడింది. అంతిమంగా, భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా పెన్నహోబిలం స్వామివారికి భారీగా సమర్పణలు చేయడం జరిగింది. ఆలయానికి భారీ మొత్తంలో హుండీ ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.
Be the first to comment