Sangareddy Bike Servicing Issue : సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో ఓ వినియోగదారుడు తన ద్విచక్ర వాహనానికి ఓలా మోటారు సంస్థ సర్వీసింగ్ చేయకుండా తిప్పించుకుంటుందని ఆ సంస్థ విక్రయ కేంద్రం డోర్కు చెప్పుల దండ వేసి వినూత్న నిరసన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే సంగారెడ్డికి చెందిన సంతోష్ కుమార్ ఓలా మోటార్ సంస్థ నుంచి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. కొద్దిరోజుల తర్వాత దానిని సర్వీసింగ్ చేయించాలని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం అశోక్నగర్లో ఉన్న షోరూం సర్వీస్ సెంటర్కు తీసుకొచ్చాడు. తర్వాత రెండు, మూడు సార్లు వెళ్లినా సర్వీస్ సెంటర్ సిబ్బంది వెహికల్ ఇవ్వలేదు. అడిగితే సరిగా స్పందించలేదు.
Be the first to comment