Actor Balakrishna Launched the Mobile Cancer Screening Bus : వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో వరల్డ్ క్యాన్సర్ డేని నిర్వహించారు. ఆసుపత్రి చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యక్రమానికి హాజరై మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును ప్రారంభించారు. బస్సు స్టీరింగ్ పట్టుకుని స్టార్ట్ చేశారు. అలాగే ఆస్పత్రిలో బ్రాకీథెరపీ యూనిట్ను కూడా ప్రారంభించారు. చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ క్యాన్సర్ని ముందస్తుగా గుర్తించటం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ఆస్పత్రిలో అందరికీ సమానంగా వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. అధునాతన వైద్య పరికరాలు ఏర్పాటు చేశామని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు కేవలం ఒక్క బస్తోనే ఏపీ, తెలంగాణల్లో పరీక్షలు నిర్వహించాల్సి వస్తోందన్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన బస్ ద్వారా మరింత విస్తృతంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయవచ్చని తెలిపారు.
Comments