Chicken Lorry Overturned Near Tirupati : చచ్చిపోయిన కోళ్ల కోసం జనం ఎగబడిన ఘటన తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో జరిగిన ప్రమాదం చికెన్ ప్రియులకు కలిసొచ్చింది. పీలేరు నుంచి తిరుపతి వైవు బ్రాయిలర్ కోళ్ల లోడుతో వెళ్తున్న లారీ తెల్లవారుజామున అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలోని కోళ్లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. మరోవైపు స్థానికుల సాయంతో డ్రైవర్ బోల్తా పడిన లారీని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. చనిపోయిన కోళ్లను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. స్థానికులతో పాటుగా ఆ మార్గంలో వెళ్తున్న వాహనాదారులు రోడ్డుపై పడిన కోళ్లను పట్టుకెళ్లడానికి పోటీపడ్డారు. దొరికిందే సందని చేతికి దొరికినన్ని కోళ్లను ఎవరికి వారు సంచిల్లో వేసుకుని మరీ ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Comments