Skip to playerSkip to main content
  • 1 week ago
Visakha CREDAI on AP Building Rules : రాష్ట్రంలో స్థిరాస్తి రంగం అభివృద్ధి చెందాలని ప్రభుత్వం జీవో 161 విడుదల చేయడం పట్ల విశాఖ క్రెడాయ్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సవరణల ద్వారా భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ సులభతరం చేశారని తెలిపారు. గతంలో అనుమతుల కోసం సుమారు 22 రకాల పత్రాలు సమర్పించాల్సి వచ్చేదన్నారు. దీనివల్ల ప్రక్రియ ఆలస్యమయ్యేదని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు కేవలం 14 పత్రాలతోనే వేగంగా అనుమతులు వచ్చేలా జీవో విడుదల చేయడం స్థిరాస్తి రంగానికి ఊతమివ్వడమేనని విశాఖ క్రెడాయ్ సభ్యులు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే విధానంలో గత కొంతకాలంగా ఉన్న సాంకేతిక, పరిపాలనాపరమైన అడ్డంకులను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రియల్​ ఎస్టేట్ రంగానికి ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. నిర్మాణ రంగంలో త్వరలోనే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పారు. జీవో 161పై హర్షం వ్యక్తం చేస్తున్న విశాఖ క్రెడాయ్ సభ్యులతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి.

Category

🗞
News
Comments

Recommended