Fire Accident At Petrol Bunk Shaikpet : సాధారణంగా మనం ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎక్కువగా మంటలు చెలరేగటం చూశాం. ఇంధనంతో నడిచే వాహనాలకు మంటలు అంటుకోవటం తక్కువగా చూస్తుంటాం. తాజాగా టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్పేట్లో పెట్రోల్ బంక్ వద్ద భారీ ప్రమాదం తప్పింది. బంక్లో ఇంధనం నింపించుకొని బయటకు వచ్చిన ఓ మాస్ట్రో ద్విచక్ర వాహనానికి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఇది గమనించిన పెట్రోల్ బంక్ సిబ్బంది, స్థానికులు వెంటనే ఫైర్ సేఫ్టీ పరికరాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పెట్రోల్ బంక్ బయట వాహనానికి మంటలు చెలరేగడంతో కొద్దిసేపు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించడంతో ప్రమాదం తప్పింది. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు దగ్దమవుతున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. నిజామాబాద్, వరంగల్, కరీంనగర్లో వరుసగా 4 ఎలక్ట్రిక్ బస్సుల్లో మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది.
Comments