Skip to playerSkip to main content
  • 5 weeks ago
Man Climbs Train Roof To Escape Ticket Check in Gudivada Station: కృష్ణాజిల్లా గుడివాడ వద్ద ధర్మవరం-నరసాపురం రైలులో టికెట్ లేని ప్రయాణికుడు హైడ్రామా చేశాడు. తెల్లవారుజామున 3 గంటలకు ధర్మవరం రైలు గుడివాడ స్టేషన్​కు చేరుకుంది. ఈ నేపథ్యంలో టీసీ రిజర్వేషన్ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న ప్రయాణికులందరి టికెట్లను తనిఖీ చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో టీసీని చూసి ఓ వ్యక్తి రైలుపై ఎక్కి హల్​చల్ చేశాడు. దాంతో ధర్మవరం-నరసాపురం వెళ్లే రైలు దాదాపు అరగంట పాటు గుడివాడ స్టేషన్​లోనే నిలిచిపోయింది. అనంతరం రైల్వే పోలీసులు అతి కష్టం మీద ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో అతడిని మతిస్థిమితం లేని వ్యక్తిగా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా దీనికి సంబంధించి రైల్వే పోలీసులు పూర్తి వివరాలన్నీ సేకరిస్తున్నారు. సాధారణంగా టికెట్​ తీసుకోకుండా ఎవరైనా ప్రయాణిస్తే జరిమానా విధించడం లేదా ట్రైన్ నుంచి దిగిపోవడం పరిపాటి, కానీ ఈ విధంగా ట్రైన్ పైకి ఎక్కడంతో ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. 

Category

🗞
News
Transcript
00:00Thank you for listening.
00:45Thank you for listening.
Comments

Recommended