Retired RPF Threatens Train Passengers For Seat in Anantapur District: ఓ రిటైర్డ్ సీఆర్పీఎఫ్ పోలీసు తన దగ్గర ఉన్న ఆయుధంతో తోటి ప్రయాణికులను బెదిరించాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి యలహంక నుంచి కాచిగూడ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైల్లో చేటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రైలు జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న సీఆర్పీఎఫ్ విశ్రాంత పోలీసు మనోహర్ సీటు కోసం ట్రైన్ ప్రయాణికులను తన లైసెన్స్డ్ రివాల్వర్తో బెదిరింపులకు దిగాడు. ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం ఆర్. కృష్ణాపురం గ్రామానికి చెందిన మనోహర్ రైలులో ప్రయాణిస్తూ రివాల్వర్ తీసుకుని హల్చల్ చేశాడు. తనకు సీటు ఇవ్వాలంటూ ప్రయాణికులను బెదిరించాడు. కొందరు ప్రయాణికులు గుంతకల్లు సీఆర్పీఎఫ్లకు సమాచారమిచ్చారు. రైలు గుంతకల్లు జంక్షన్కు చేరుకోగానే బోగీ వద్దకు చేరుకుని విశ్రాంత పోలీసును అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. తాను రివాల్వర్తో ప్రయాణికులను బెదిరించలేదని పోలీసులకు సమాధానమిచ్చారు. ఇక ముందు ఈ విధంగా ప్రవర్తిస్తే గట్టి చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించి పంపారు.
Comments