Skip to playerSkip to main content
  • 5 minutes ago
Retired RPF Threatens Train Passengers For Seat in Anantapur District: ఓ రిటైర్డ్​ సీఆర్పీఎఫ్​ పోలీసు తన దగ్గర ఉన్న ఆయుధంతో తోటి ప్రయాణికులను బెదిరించాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి యలహంక నుంచి కాచిగూడ వెళ్తున్న ఎక్స్​ప్రెస్​ రైల్లో చేటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రైలు జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న సీఆర్పీఎఫ్ విశ్రాంత పోలీసు మనోహర్ సీటు కోసం ట్రైన్ ప్రయాణికులను తన లైసెన్స్​డ్​ రివాల్వర్​తో బెదిరింపులకు దిగాడు. ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం ఆర్. కృష్ణాపురం గ్రామానికి చెందిన మనోహర్ రైలులో ప్రయాణిస్తూ రివాల్వర్ తీసుకుని హల్​చల్ చేశాడు. తనకు సీటు ఇవ్వాలంటూ ప్రయాణికులను బెదిరించాడు. కొందరు ప్రయాణికులు గుంతకల్లు సీఆర్పీఎఫ్​లకు సమాచారమిచ్చారు. రైలు గుంతకల్లు జంక్షన్​కు చేరుకోగానే బోగీ వద్దకు చేరుకుని విశ్రాంత పోలీసును అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్​కు తీసుకెళ్లి విచారించారు. తాను రివాల్వర్​తో ప్రయాణికులను బెదిరించలేదని పోలీసులకు సమాధానమిచ్చారు. ఇక ముందు ఈ విధంగా ప్రవర్తిస్తే గట్టి చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించి పంపారు. 

Category

🗞
News
Transcript
00:00Thank you for joining us.
00:45Thank you for joining us.
Comments

Recommended