Skip to playerSkip to main content
  • 2 days ago
Couple Theft Gold in Jewellery Shop in Nandyal: రోజురోజకీ బంగారం, వెండి ధరలు కొండెక్కుతున్నాయి. సామాన్యులు ఒక గ్రాము కొనడం కూడా కష్టంగానే మారింది. ఆ కష్టం తమకెందుకులే, చేతివాటంతో బంగారం సొంతం చేస్తుకుందామనుకున్నారో ఏమో గానీ ఓ దంపతులు బంగారం దుకాణానికి కొనుగోలుదారుల్లా వచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. అసలే అందెలమెక్కిన రేట్లాయే, దుకాణ యజమాని తన జాగ్రత్తలో తానుంటాడుగా. అనుమనం వచ్చి సీసీ కెమెరా చూడగా వాళ్ల బండారం బయటపడింది. ఈ  ఘటన నంద్యాలలోని ఓ బంగారు దుకాణంలో జరిగింది.యజమాని తెలిపిన వివరాల ప్రకారం బంగారు దుకాణాల వీధిలో ఉన్న ఆన్సర్ జ్యూవెలర్స్​లో బంగారు కొనుగోలు చేసేందుకు దంపతులు వచ్చారు. 5 గ్రాముల బంగారు డాలర్ కొనుగోలు చేస్తామని సిబ్బందిని అడగడంతో వారు డాలర్​లను చూపించారు. ఈ క్రమంలో సిబ్బంది కన్నుగప్పి చరవాణి చాటున ఆ వ్యక్తి బంగారు డాలర్ తీసుకొని చొక్కా జేబులో పెట్టుకున్నాడు. అనంతరం దుకాణం నుంచి వారు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న షాపు యజమాని సీసీ కెమెరాలు పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Category

🗞
News
Transcript
00:00.
Comments

Recommended