Heavy Rains In Erstwhile Adilabad District : ఉమ్మడి ఆదిలాబాద్లో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. ఇంద్రవెల్లి, తలమడుగు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఏజెన్సీ మండలాలైన నార్నూర్, జైనూర్లో బుధవారం రాత్రి నుంచి క్రమం తప్పకుండా కురుస్తున్న వర్షాలతో నర్సాపూర్, శాంతాపూర్ వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచాయి. ఈ క్రమంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. క్రమం తప్పకుండా కురుస్తున్న వర్షాలు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో స్థానికులు ఇళ్లకే పరిమితం అయ్యారు. మరోవైపు ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో నిర్మల్ జిల్లాలోని కండెం ప్రాజెక్టు, గడ్డెన్నవాగు ప్రాజెక్టులకు వరద వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రజల్ని అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప స్థానికులెవరూ బయటకు రావొద్దని సూచించారు.మొదలైన గోదావరి పరుగు - ఎల్లంపల్లికి 56 వేల క్యూసెక్కుల వరదజూరాల ప్రాజెక్టుకు జలకళ - క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం
Comments