Skip to playerSkip to main content
  • 2 days ago
10,000 Mangroves Planted in Sundarbans : నేడు బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ పుట్టిన రోజు సందర్భంగా సుందర్​ బన్​ అడవుల్లో 10 వేల మొక్కలను మాజీ మంత్రి జోగినపల్లి సంతోష్​ కుమార్​ నాటించారు. కేసీఅర్​ పుట్టినరోజున పర్యావరణ పరిరక్షణ  కోసం గంగా బ్రహ్మపుత్ర మేఘ్నా నదుల పరీవాహకంలో ఉన్న సుందర్​ బన్​ డెల్టా  ప్రాంతంలో పదివేల మ్యాన్గ్రోవ్​ మొక్కలు పెట్టించామని తెలిపారు. యువత, పర్యావరణాన్ని కాపాడే ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్న నినాదాన్ని దేశవ్యాప్తం చేస్తున్నామని చెప్పారు. మొక్కలు ఈ అడవులు తీరాన్ని కాపాడే విషయంలో ఎంతో కీలకపాత్ర పోషిస్తున్నాయని, మనతోపాటు ముందుతరాలకు సైతం చేరవేయడం ఈ ఉద్యమ ఉద్దేశ్యం అని సంతోష్​ అన్నారు. పర్యావరణ ప్రేమికులందరినీ ఒక చోట చేర్చి ఈ ప్రక్రియను ఘనంగా చేపట్టి కేసీఆర్​ ఇచ్చిన స్ఫూర్తిని దేశవ్యాప్తం చేయడమే తమ టీమ్​ లక్ష్యం అని చెప్పారు. తుఫాన్ల నుంచి తీరాన్ని కాపాడడం, అలల తీవ్రతను అడ్డుకోవడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో ఈ మడ అడవుల పాత్ర ఎనలేనిదని అందుకే మరిన్ని మొక్కలు నాటామని పేర్కొన్నారు.  

Category

🗞
News
Transcript
00:26Thank you very much.
00:45Thank you very much.
01:18Thank you very much.
01:46Thank you very much.
Comments

Recommended