10,000 Mangroves Planted in Sundarbans : నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సుందర్ బన్ అడవుల్లో 10 వేల మొక్కలను మాజీ మంత్రి జోగినపల్లి సంతోష్ కుమార్ నాటించారు. కేసీఅర్ పుట్టినరోజున పర్యావరణ పరిరక్షణ కోసం గంగా బ్రహ్మపుత్ర మేఘ్నా నదుల పరీవాహకంలో ఉన్న సుందర్ బన్ డెల్టా ప్రాంతంలో పదివేల మ్యాన్గ్రోవ్ మొక్కలు పెట్టించామని తెలిపారు. యువత, పర్యావరణాన్ని కాపాడే ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్న నినాదాన్ని దేశవ్యాప్తం చేస్తున్నామని చెప్పారు. మొక్కలు ఈ అడవులు తీరాన్ని కాపాడే విషయంలో ఎంతో కీలకపాత్ర పోషిస్తున్నాయని, మనతోపాటు ముందుతరాలకు సైతం చేరవేయడం ఈ ఉద్యమ ఉద్దేశ్యం అని సంతోష్ అన్నారు. పర్యావరణ ప్రేమికులందరినీ ఒక చోట చేర్చి ఈ ప్రక్రియను ఘనంగా చేపట్టి కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తిని దేశవ్యాప్తం చేయడమే తమ టీమ్ లక్ష్యం అని చెప్పారు. తుఫాన్ల నుంచి తీరాన్ని కాపాడడం, అలల తీవ్రతను అడ్డుకోవడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో ఈ మడ అడవుల పాత్ర ఎనలేనిదని అందుకే మరిన్ని మొక్కలు నాటామని పేర్కొన్నారు.
Comments