14 Feet Tall Jala Shiva lingam Idol In Fasalwadi Sangareddy Dist : సంగారెడ్డి జిల్లా పసల్వాదిలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం మహాశివరాత్రి పురస్కరించుకుని 14 అడుగుల ఎత్తు గల జలలింగాన్ని ప్రతిష్టించింది. దేశంలోని నదుల నుంచి సేకరించిన నీటితో ఈ జలలింగాన్ని ఆవిష్కరించారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి నాడు జ్యోతిర్వాస్తు విద్యాపీఠం లింగాన్ని ప్రత్యేకంగా తయారు చేయడం అనవాయితీగా వస్తోంది. గత ఏడాది కోటి రుద్రాక్షలతో రుద్రాక్ష లింగాన్ని ఆవిష్కరించారు. ఈ ఏడాది జల లింగాన్ని అందుబాటులోకి తెచ్చి నదులను కాపాడాలి, నదుల్లో ప్లాస్టిక్, బట్టలు, మలమూత్ర విసర్జనలు చేయకూడదన్న నినాదంతో ఈ ఏడాది ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికు విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. ఈనెల 18వ తేదీ వరకు ఈ జల లింగ దర్శనానికి అవకాశం ఉంటుందని జ్యోతిర్వాస్త విద్యాపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. రేపు మహాశివరాత్రి సందర్భంగా ఈ శివలింగానికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
Comments