TDP Rajya Sabha MP Sana Sathish Babu Slams Jagan: నేరాలు కప్పిపుచ్చేందుకు, నేరస్తుల్ని దాచేందుకు జగన్ ప్యాలెస్లు స్థావరాలుగా మారుతున్నాయని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఆరోపించారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన అనంతబాబు ఇన్నాళ్లూ జగన్ ప్యాలెస్లోనే దాక్కున్నాడన్నారు. దళితుల్ని హత్య చేసేవారిని, దళిత వ్యతిరేకుల్ని వైఎస్సార్సీపీ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. హత్యా రాజకీయాలనేవి జగన్కు తాతల కాలం నుంచీ ఆనవాయితీగా వస్తున్నాయని ఎద్దేవా చేశారు. జగన్ కర పత్రిక సాక్షిలో కులాల మధ్య చిచ్చుపెట్టేలా తప్పుడు రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో అధికారంలో ఉండగా కొన్ని కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోయాక ఇంకొన్ని కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు. జగన్ పద్దతి మారకపోతే 11సీట్ల నుంచి 1సీటుకు పడిపోవడం ఖాయమని హెచ్చరించారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టే జగన్ కుట్రలకు ప్రజలు ధీటుగా బదులిస్తారని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకుని పారిశ్రామిక వేత్తల్లో గందరగోళం సృష్టించాలని చూసే జగన్ ఎత్తులు పారనివ్వమని అన్నారు.
Comments