Skip to playerSkip to main content
  • 15 minutes ago
Special Interview with SEEDAP MD Narayanaswamy : ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిగ్రీలు మాత్రమే ఉంటే సరిపోదు. చేతిలో నైపుణ్యం ఉంటేనే ఉపాధి అవకాశాలు దక్కుతాయి. ఈ క్రమంలో గ్రామీణ యువతను గ్లోబల్‌ లీడర్లుగా మార్చడమే లక్ష్యంగా సీడాప్‌ సంస్థ తగిన ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతోంది. కేవలం స్థానిక పరిశ్రమల్లోనే కాకుండా జర్మనీ, జపాన్‌ వంటి దేశాల్లో లక్షల రూపాయల వేతనంతో ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహిస్తోంది. యువతకు సరైన కెరీర్‌ అందించడంలో సంస్థ ఏ విధంగా కృషి చేస్తోంది? రాబోయే రోజుల్లో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి? తదితర విషయాలు సీడాప్‌ ఎండీ నారాయణ స్వామి మాటల్లోనే విందాం. ''దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అనేది సెంట్రల్ గవర్నమెంట్ పథకం. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సహకారం అందిస్తుంది. ఈ పథకం ముఖ్యంగా 18 నుంచి 35 సంవత్సరాలు మధ్య ఉన్నా గ్రామీణ యువతకు శిక్షణ ఇస్తున్నాం. కాలానుగుణంగా మనం మారాల్సిన అవసరం ఉంది. కాబట్టి పిల్లల ఆసక్తి ఉన్నా కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తున్నాం.'' - సీడాప్‌ ఎండీ నారాయణ స్వామి

Category

🗞
News
Comments

Recommended