Skip to playerSkip to main content
  • 2 days ago
CM Chandrababu Aerial View At Blowout Area in Konaseema District: అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ఘటనపై ఓఎన్జీసీ అధికారులు, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్, ఎంపీ హరీశ్, ఎమ్మెల్యే వరప్రసాద్​లతో మండపేట నియోజకవర్గం, రాయవరంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బ్లో అవుట్ నివారణకు సంబంధించిన చర్యలను సీఎం చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యాపించిన మంటల కారణంగా దెబ్బతిన్న కొబ్బరిచెట్లకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ నెల 5వ తేదీన సంభవించిన బ్లో అవుట్ మంటల తీవ్రత ఈరోజుకు మరింత తగ్గింది. అయితే ఓఎన్‌జీసీ బ్లో అవుట్ నుంచి మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. గత 2 రోజులు కంటే ఈరోజు మంటల తీవ్రత తగ్గింది. 400 జీపీఎం సామర్థ్యం గల భారీ పంపు యంత్రంతో మంటలపై నీటిని నిరంతరాయంగా పంపుతున్నారు.

Category

🗞
News
Transcript
00:00Thank you for listening.
Be the first to comment
Add your comment

Recommended