Skip to playerSkip to main content
  • 1 year ago
Pawan Kalyan on Allu Arjun Issue : హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ ఘటనలో గోటితో పోయే దాన్ని గొడ్టలి దాకా తెచ్చారని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ అల్లు అర్జున్‌ ఒక్కడినే దోషిగా చేశారని, ఇది కరెక్టు కాదని అభిప్రాయపడ్డారు. ఆడబిడ్డ చనిపోయారన్న బాధ అల్లు అర్జున్‌లో కూడా ఉందని పవన్‌ అన్నారు. అయితే అల్లు అర్జున్ తరఫున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేదని, అంత వివాదం అయి ఉండేది కాదన్నారు. ఈ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని పవన్‌ పేర్కొన్నారు. ఈ‌ ఘటనలో రేవతి చనిపోవడం తనను కలచివేసిందని అన్నారు.

Category

🗞
News
Comments

Recommended