IPS Officer CP Sumathi Conducts a key Operation : ఇటీవల మల్కాజ్గిరి సీపీగా ఐపీఎస్ అధికారి సుమతి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం సీపీ సుమతి అర్థరాత్రి కీలక ఆపరేషన్ చేపట్టారు. కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే మహిళల భద్రతపై దృష్టి పెట్టారు. సాధారణ యువతులు, మహిళలు రాత్రి టైంలో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకోవాలని అనుకున్నారామే. అందుకు స్వయంగా సీపీనే రంగంలోకి దిగారు. అందుకు ఓ ప్రణాళిక వేసుకున్న సీపీ సుమతి సగటు మహిళగా దిల్సుఖ్నగర్ పరిసర ప్రాంతాల్లోని బస్టాండ్లలో నిల్చున్నారు. సాధారణ మహిళకు ఎదురయ్యే వేధింపులను సీపీ స్వయంగా ఎదుర్కొంది. బస్టాండ్లో నిల్చొన్నది సీపీ అని తెలియక కొంతమంది పోకిరీలు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. ఏ మాత్రం భయడని సీపీ వారి చర్యలను నిశితంగా గమనించారు. సుమతిని దాదాపు 40 మంది పోకిరీలు చుట్టుముట్టి రకరకాల ప్రశ్నలతో వేధించారు. ఆమెను వేధించిన వారిలో సుమారు విద్యార్థులే ఉన్నట్లు సమాచారం. సుమతిని వేధించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
Comments