Skip to playerSkip to main content
  • 10 hours ago
IPS Officer CP Sumathi Conducts a key Operation : ఇటీవల మల్కాజ్‌గిరి సీపీగా ఐపీఎస్‌ అధికారి సుమతి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం సీపీ సుమతి అర్థరాత్రి కీలక ఆపరేషన్‌ చేపట్టారు. కమిషనర్​గా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే మహిళల భద్రతపై దృష్టి పెట్టారు. సాధారణ యువతులు, మహిళలు రాత్రి టైంలో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకోవాలని అనుకున్నారామే. అందుకు స్వయంగా సీపీనే రంగంలోకి దిగారు. అందుకు ఓ ప్రణాళిక వేసుకున్న సీపీ సుమతి సగటు మహిళగా దిల్‌సుఖ్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లోని బస్టాండ్‌లలో నిల్చున్నారు. సాధారణ మహిళకు ఎదురయ్యే వేధింపులను సీపీ స్వయంగా ఎదుర్కొంది. బస్టాండ్‌లో నిల్చొన్నది సీపీ అని తెలియక కొంతమంది పోకిరీలు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. ఏ మాత్రం భయడని సీపీ వారి చర్యలను నిశితంగా గమనించారు. సుమతిని దాదాపు 40 మంది పోకిరీలు చుట్టుముట్టి రకరకాల ప్రశ్నలతో వేధించారు. ఆమెను వేధించిన వారిలో సుమారు విద్యార్థులే ఉన్నట్లు సమాచారం. సుమతిని వేధించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు విద్యార్థులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

Category

🗞
News
Comments

Recommended