MLA Somireddy Comments On Ys Jagan : జగన్ అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చొంటాను అంటే కుదరదని సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రజలు ఎన్నుకున్న 11 మంది అసెంబ్లీకి రాకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక విద్యార్థి పరీక్షలకు గైర్హాజరైతే ఆయన్ను పాస్ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద శాసనాలు చేయాలని ఆయా నియోజకవర్గాల ప్రజలు పంపించారని తెలిపారు. అంతేగాని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి రాకుండా ప్రజాప్రతినిధులు ఇంట్లో అలిగి కూర్చుంటారా? అని మండిపడ్డారు. బడ్జెట్ చర్చలో భాగంగా శానససభలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Be the first to comment