TRIBUTE TO POTTI SRIRAMULU: ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు సేవలు నిరుపమానమని, ఆయనను భావితరాలు గుర్తించుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. పొట్టి శ్రీరాములు సామాజికవాది, మానవతావాదిగా చంద్రబాబు కొనియాడారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేయకుండా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రం ఇస్తే బాగుండేదని చెప్పారు. పొట్టి శ్రీరాములు సేవలకు గుర్తుగా ఆంధ్రప్రదేశ్లోనూ తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన పుట్టిన గ్రామాన్ని స్మారక ప్రదేశంగా మారుస్తామని చెప్పారు.
Be the first to comment