Skip to playerSkip to main content
  • 12 minutes ago
Bhakta Ramadasu 10th Generation Visited Goddess Durga Temple : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గ అమ్మవారిని ప్రముఖ వాగ్గేయకారుడు భక్త రామదాసు (కంచర్ల గోపన్న) పదో తరం వారసులు కంచర్ల శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న రామదాసు వారసుల కుటుంబానికి ఆలయ ఈవో శీనా నాయక్ సాదర స్వాగతం పలికి అమ్మవారి ప్రత్యేక దర్శనం చేయించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. భక్తి పారవశ్యంతో శ్రీరాముని కీర్తిస్తూ సంకీర్తనలతో రామభక్తిని నేల నాలుగు చెరగులా చాటిన భక్త రామదాసు వంశీయులుగా ఉండటం తమ పూర్వజన్మ సుకృతమని కంచర్ల శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనాన్ని తమ కుటుంబానికి ప్రత్యేకంగా చేయించిన ఈవో శీనా నాయక్​కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వేద ఆశీర్వచనం అందించిన పండితులకు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి అనుగ్రహంతోపాటు, భద్రాద్రి రాముడు ఆశీస్సులు ఉండాలని కంచర్ల శ్రీనివాసరావు వేడుకున్నారు.

Category

🗞
News
Transcript
00:01Oh
00:30Namnam Tamakta Namo Putra Raham Satasambh Sanandhir Ghamayu
00:35Namam Namo Nisanayapadengri yeah Shreve Indri
00:39Pratyekitrishati Nakhapadevatar Kutah Tastrashtu
00:42Airavagya Nishwanyabhutrashtu
00:45Aravingled Chavar titrashtu
00:47Unam Darsilayip 97hole
00:50I
00:51HEVE AINDRAKHILA 3217
01:07Thank you very much.
01:37Thank you very much.
Comments

Recommended