Skip to playerSkip to main content
  • 1 week ago
TDP MLAs Visits Tirumala Devasthanam : తిరుమల వెంకన్నను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గంటా శ్రీనివాసరావు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల దంపతులు, నిర్మాత డీవీవీ దానయ్య వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు వెంకన్నను దర్శించుకొని, మెుక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ : తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 20 గంటల సమయం పడుతోంది. భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం నాడు శ్రీవారిని 68,374 మంది భక్తులు దర్శించుకోగా, 35,241 మంది తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు సమకూరింది.

Category

🗞
News
Transcript
00:00Thank you so much for joining us.
Comments

Recommended