Python Attack On Sheep in Siddipet : ఓ కొండచిలువ గొర్రెను మింగేసే ప్రయత్నం చేయగా దాన్ని గొర్రెల కాపర్లు రక్షించారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో చోటుచేసుకుంది. దాత బోయిన సంపత్, రవి అనే గొర్రెల కాపర్లు ఎప్పటిలాగానే గ్రాశివారులో పెద్దగుట్ట, సంజీవరాయ గుట్ట మధ్యలోని కల్కి చెరువు వద్ద గొర్రెలను మేపుతున్నారు. ఇంతలో ఓ గొర్రెపై కొండ చిలువ దాడి చేసింది. ఇది గమనించిన కాపర్లు వెంటనే అప్రమత్తమై కొండచిలువ భారీ నుండి గొర్రెను విడిపించారు. గొర్రెను కొండచిలువ చుట్టుకొని మింగేసే ప్రయత్నం చేస్తుండగా, దాని కాళ్లకు తాడు కట్టి బయటకు లాగి రక్షించినట్లు కాపర్లు తెలిపారు. అనంతరం కొండచిలువను బంధించి సురక్షిత ప్రాంతంలో వదిలివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గోవర్ధనగిరి ప్రాంతంలో ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదని గొర్రెల కాపరులు తెలిపారు.
Comments