Skip to playerSkip to main content
  • 1 day ago
Independence Celebrations In Kamareddy : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సందడిగా సాగాయి. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ముఖ్యంగా గిరిజన పాటలకు విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ, అభివృద్ధి ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు హాజరయ్యారు. గిరిజన పాటలకు విద్యార్థులు నృత్యాలు చేస్తుండగా, హనుమంతరావు కూడా స్టేజీ దిగి విద్యార్థులతో కలిసి నృత్యాలు చేశారు. దీంతో వేడుకల ప్రాంగణంలో ఒక్కసారిగా జోష్ నెలకొంది. హనుమంతరావు నృత్యంతో ఉత్సాహం పొందిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్‌ రెడ్డిలు సైతం ఆయనతో కలిసి నృత్యాలు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు కలిసి డ్యాన్స్ చేయడంతో స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్న వాతావరణమంతా సందడిగా మారింది. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. 

Category

🗞
News
Transcript
00:00The
Comments

Recommended