Pavan Kalyan Participated In First Feeding Ceremony : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించినప్పుడు ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. స్వామివారికి ప్రార్థనలు సమర్పించిన అనంతరం, కృష్ణా జిల్లాకు చెందిన కొందరు భక్తులు పవన్ కల్యాణ్ను కలిసి తమ బిడ్డకు అన్నప్రాసన నిర్వహించమని అభ్యర్థించారు. వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన పవన్ కల్యాణ్ ఆ బిడ్డకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను ఈ కార్యక్రమం కోసమే ఆలయ ప్రాంగణానికి తీసుకువచ్చారు. పవన్ కల్యాణ్ వస్తున్నారని తెలుసుకున్న వారు ఆయన రాక కోసం వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆయన వెళ్లేటప్పుడు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించమని వారు అడగ్గా ఆయన వెంటనే అంగీకరించారు. ఇది ఆ తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. గుడి ప్రాంగణం నుంచి బయటికి వెళ్లే సమయంలో పవన్ కల్యాణ్ అభిమానులు అతనితో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. అలానే పెద్ద ఎత్తున జై పవన్ అంటూ నినాదాలు కూడా చేశారు.
Comments