CM Chandrababu and Lokesh Eat School Food : పోలవరం జిల్లా రంపచోడవరంలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్కు హాజరైన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విద్యార్థులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం రుచి చూశారు. పిల్లలతో కలిసి నేలపై కూర్చొని భోంచేశారు. ఆహార నాణ్యత, రుచి గురించి పిల్లల్ని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు నాణ్యమైన సన్నబియ్యం ఇస్తున్నామని మంత్రి లోకేశ్ సీఎం దృష్టికి తెచ్చారు. స్నాక్స్ ఇస్తున్నారా? లేదా? అని సీఎం విద్యార్థుల్ని అడగ్గా ఇస్తున్నారని వారు బదులిచ్చారు. చిన్న పిల్లలకు, ఎదిగే పిల్లలకు రాగి మాల్ట్, చిక్కీలు రెండు రకాల పరిమాణాలతో ఇవ్వాలని సీఎం సూచించారు. సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడూ చిక్కీలు ఇస్తే బాగుంటుందని సీఎం సూచించారు. అలాగే విటమిన్ డెఫిషియన్సీ నివారించేలా న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలన్నారు. మెగా PTM ఒక అద్భుతమైన కార్యక్రమమన్న ఆయన ఇవాళ తానూ ఓ విద్యార్థిలా, టీచర్లా, మెంటార్లా మారే అవకాశం కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. పిల్లల పెంపకం సహా ఇంటి పనుల్లో తల్లిదండ్రులు ఇద్దరూ సమాన పాత్ర పోషించాలని సీఎం పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థుల కోరిక మేరకు వారితో కలిసి సీఎం చంద్రబాబు ఫొటోలు దిగారు.
Comments