Green Roof at Traffic Signals in Vijayawada : వేసవి ఎండలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బెజవాడలో ప్రజల జీవితాలను మండుటెండ దుర్భరం చేస్తోంది. ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. అవి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు విజయవాడ నగరంలో నానాటికీ పెరుగుతున్న రద్దీకి తోడు విపరీతమైన ఎండలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ నగరంలో కీలకమైన కూడళ్లు, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకుని నగర పాలక సంస్థ అధికారులు ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద షేడ్ నెట్లు (గ్రీన్ నెట్స్) అందుబాటులోకి తీసుకువచ్చారు. నగరంలోని ప్రధాన మార్గాల్లో ఈ షేడ్ నెట్లకు ఏర్పాటు చేశారు. షేడ్ నెట్లు ఏర్పాటు చేయటం పట్ల వాహనదారులు సంతోషం వక్తం చేస్తున్నారు. ఈ నెట్లను అన్ని ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏర్పాటు చేయాలని కొరుతున్నారు. సీఎం చంద్రబాబుకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
Comments