Skip to playerSkip to main content
  • 2 days ago
Actress Nayanthara And Her Husband Vignesh Shivan Visited Tirumala : తిరుమల శ్రీవారిని అందాల నటి నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు గురువారం దర్శించుకున్నారు. వారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి, శ్రీవారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించారు. తర్వాత రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వాదం పొందారు. స్వామివారి తీర్థప్రసాదాలు కూడా అందజేశారు. నయనతార దంపతులను చూసేందుకు అభిమానులు భారీగా చేరుకుని వారితో కలిసి సెల్ఫీలు, ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ జంట తమ కెరీర్​లో ఫుల్​ బిజీగా ఉన్నారు. నయనతార పాన్​ఇండియ సినిమాలతో ఫుల్​ బిజీగా ఉన్నారు. 2026 జూన్​ 4న విడుదలయ్యే "టాక్సిక్"​ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక విఘ్నేష్ శివన్ విషయానికి వస్తే  "లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ" అనే కామెడి చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది 2026 ఏప్రిల్​ 10న థియేటర్లలో విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ పనులు భారీగా జరుగుతున్నాయి. 

Category

🗞
News
Transcript
00:00What
Comments

Recommended