BRS Leader KTR Inaugurates Cricket Tournament : మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయరలో క్రికెట్ టోర్నమెంట్ను మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రారంభించారు. మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేటీఆర్ ఆదివారం ఈ కారక్రమాన్ని ప్రారంభించారు. మల్లారెడ్డి గోల్డెన్ జూబ్లీ పెళ్లి వేడుకలను మొదటిసారి పెళ్లి చేసుకున్న విధంగా 6 రోజుల పెళ్లి మహోత్సవం జరిపిస్తున్నారని, సంగీత్ కూడా ఏర్పాటు చేసి వైభవంగా జరిపిస్తున్నారని కేటీఆర్ అన్నారు. సంగీత్కు తాను హాజరవుతున్నట్లు తెలిపారు. మల్లారెడ్డి ఆయన సతీమణి కల్పన పేర్లను కలుపుతూ మల్పనగా పిలుచుకోవాలని సూచించారు. అనంతరం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన మహిళా కౌన్సిలర్లను శాలువాలతో సన్మానించారు. ఇండియా టీ 20 ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ ఉందని ఇక్కడ కూడా యువకులు టోర్నమెంట్లో రాణించాలని కేటీఆర్ అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మల్లారెడ్డి బౌలింగ్ చేయగా కేటీఆర్ బ్యాటింగ్ చేస్తూ టోర్నమెంట్ను ప్రారంభించారు.
Comments