Wings India Exhibition In Begumpet : వింగ్స్ ఇండియా ప్రదర్శనకు బేగంపేట విమానాశ్రయం వేదికైంది. బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. పౌరవిమానయాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 31 వరకు ఇది కొనసాగనుంది. వివిధ దేశాలు, సంస్థలకు చెందిన విభిన్న రకాల విమానాలు, హెలికాప్టర్లు, పోర్టబుల్ ఫ్లయిట్లు, వాణిజ్య విమానాలు వైమానిక ప్రదర్శనలో చేస్తున్న విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. భారత్లో విమాన ప్రయాణికుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలను ఆకర్షించే విధంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ ఆధ్వర్యంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన అధునాతన విమానాలు కనువిందు చేస్తున్నాయి.
Comments