Officers Neglect Repairing Drains in Guntur District : పంట కాలువల అధ్వాన దుస్థితికి చేరుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువల్లో తూటుకాడ, గుర్రపు డెక్క దట్టంగా పేరుకుపోవడంతో నీటి సరఫరాకు ఆటంకం కలుగుతుంది. దీంతో ఆయకట్టు చివరిలో ఉన్న భూములకు నీరందని పరిస్థితి ఏర్పడింది. కాలువ మరమ్మతులకు ప్రభుత్వం నిధులు ఇచ్చినా అధికారులు పనులు చేపట్టకుండా జాప్యం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.