Alluri Sitarama Raju International Airport Drone Visuals : విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం డ్రోన్ విజువల్స్ అలరిస్తున్నాయి. ఆగస్టు ఒకటో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం ఎంతో దోహదం చేయనుంది. ఈ ఎయిర్పోర్ట్ డ్రోన్ విజువల్స్ ఎంత కనువిందు చేస్తున్నాయో చూద్దాం రండి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీన్ని అత్యంత ప్రతిష్ఠాతక్మంగా తీసుకుంది. ఈ కార్యక్రమంలో గిరిజన సంప్రదాయం ప్రతిబింబించేలా 13 వేల మంది గిరిజనులు థింసా నృత్య ప్రదర్శన చేయనున్నారు. సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులు బుధవారం సమీక్ష నిర్వహించారు. జనసమీకరణ, ఆహారం, పార్కింగ్, రవాణా సదుపాయం, తదితర ఏర్పాట్లపై చర్చించారు. సుమారు రూ.4500 కోట్లతో 2200 ఎకరాల్లో ఈ ఎయిర్పోర్టును నిర్మించారు.