Skip to playerSkip to main content
  • 17 minutes ago
Sabitham Waterfall attracting Tourists  : రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో  చిన్న నదులు, వాగుల్లో క్రమంగా వరద ప్రవాహిస్తోంది. ప్రధానంగా కొండ ప్రాంతాల్లో సెలయేర్లు కనువిందు చేస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా సబితం గ్రామ పరిధిలోని గౌరిగుండాల జలపాతం పొంగి పొర్లుతూ సవ్వడి చేస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ సెలయేరుకు నీరు వచ్చి చేరడంతో, ప్రవాహం కొనసాగుతోంది. చుట్టూ దట్టమైన కొండలు, పచ్చని చెట్లు, పైనుంచి పాలలా దూకుతున్న నీటితో జలపాతం చూపరులను కట్టిపడేస్తోంది. దీనికి తోడు చిరుజల్లులు కురుస్తూ చల్లని వాతావరణంతో పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. ప్రస్తుతం కురిసే వర్షాల వల్ల మరో రెండు రోజుల్లో జలపాతం మరింత పొంగి పొర్లే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ సబితం జలపాతం అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.20 కోట్లను మంజూరు చేసింది. ప్రస్తుతం అక్కడ వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.  

Category

🗞
News
Transcript
00:28I'll see you next time
00:58I'll see you next time
01:12I'll see you next time
Comments

Recommended